వేయి స్థంబాల ఆలయంలో పూజలు
వరంగల్ : పవిత్ర కార్తీక మాసం సందర్భంగా చారిత్రాత్మకమైన శ్రీ రుద్రేశ్వరస్వామి వేయి స్థంభాల దేవాలయంలో కార్తీక మాసోత్సవ పూజల్లో భాగంగా రెండో సోమవారం రోజు ఉదయం 5గంటలకు సుప్రభాతం, గణపతిపూజ, రుద్రేశ్వరునికి మహాన్యాసక ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు, 51కిలోల పెరుగన్నంతో శ్రీ రుద్రేశ్వరున్ని అలంకరించి అన్నసూక్త మంత్రి పఠనంతో ప్రత్యేక పూజలను మహా వైభవంగా నిర్వహించడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్ సుబ్బారావు తెలిపారు. ఈ సందర్బంగా దేవాలయ ప్రాంగణంలో మహీ శివభక్తుడైన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాడిశెట్టి సాంబయ్య దంపతుల ఆర్థిక సహాయంతో మహా అన్నదానం నిర్వహించారని ఆయన తెలిపారు. అన్ని దానములలో కంటే అన్నదాన మే మిన్న ఆకలితో ఉన్నవారికి పిడికెడు అన్నం పెడితే అతని ఆత్మ సంతృప్తి చెందుతుందని ఆయన వివరించారు .ఈ అన్నదాన కార్యక్రమంలో రెండు వేలమంది శివభక్తులు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మతో పాటు వేద పురోహితులు శివపురం శ్రీకాంత్శర్మ, పిల్లల మఱ్ఱి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 27 October, 2009
|