వరంగల్ : జిల్లాలో మావోలు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. వరంగల్ జిల్లా కొత్తగూడెం మండలం కోనాపురంలో కాంగ్రెస్ నేత కడారి నరసింహారెడ్డిని మావోలు కాల్చి చంపారు. మావోల గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నాడనే నెపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని సమాచారం. ప్రభుత్వపు బూటకు ఎన్ కౌంటర్లకు నిరసనగా ఈ హత్య చేసినట్లు ఘటనా స్థలంలో మావోయిస్టు నేత పుష్పక్క పేరుతో ఓ లేఖ వదిలి వెళ్లారు.