విశాఖపట్నం : నగరంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. మృతి చెందిన రోగి బంధువులు అసభ్య పదజాలంతో దూషించారంటూ జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. దీంతో వైద్య సేవలు అందకు రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరికొంతమంది తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.