విశాఖపట్నం : స్థానికులకు గంగవరం పోర్టు వద్ద ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ గంగవరం పోర్టు గోడను వీరు పగులగొట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.