తిరుపతి : ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి శ్రీ వేకంటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబ సమేతంగా గురువారం తిరుపతి వచ్చారు. ఆయన పెద్ద కుమారుడి కూతురు తలనీలాలు తీయించుకునేందుకు తిరుమల వచ్చినట్లు మీడియాకు తెలిపారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి నియోజకవర్గంలో పర్యటించడం చాలా సంతోషంగా ఉందని అల్లు అన్నారు. రాజకీయ విషయాలు మాట్లాడుకోవడం ఇప్పుడు సముచితం కాదన్నారు.