కృష్ణానదిలో పుణ్యస్నానాలు
విజయవాడ : కార్తీక సోమవారంతో పాటు కార్తీక పౌర్ణమి కూడా కలసిరావడంతో వేలాది మంది భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైనరోజు సోమవారం నాడు పౌర్ణమి కూడా కావడంతో భక్తులు మరింత భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరించి నది ఒడ్డున దీపారాధనలు చేశారు. ఇంద్ర కీలాద్రిపై కొలువున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కార్తీక మాసంలో తెలిసికానీ, తెలియక కానీ దీపారాధన చేస్తే పాపాలన్నీ పటాపంచలవుతాయని భక్తుల నమ్మకం. అయితే దుర్గా స్నాన ఘట్టంలో వరదల ఇసుకమేటలు ఇంకా తొలిగించకపోవడంతో భక్తులు జల్లు స్నానాలు చేయవలసి వచ్చింది.
News Posted: 2 November, 2009
|