శ్రీశైలంలో భక్తుల సందడి
శ్రీశైలం : రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి, సోమవారం సందర్భంగా భ్రమరాంబా మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామి దర్శనానికి సుమారు పది గంటల సమయం పడుతోంది. క్యూ కాంప్లెక్స్ లు నిండిపోయాయి. మరో కిలోమీటరు మేరకు భక్తులు బయట రోడ్డుపై క్యూ లైన్ లో స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. కార్తీక మాసంలో శివారాధన మరింత విశిష్టం. కార్తీక సోమవారం, పున్నమి రెండూ ఒకే రోజు రావడంతో భక్తులు ఎంతో సంతోషంతో దీప, దానాలు చేస్తున్నారు. శివుడు అభిషేక ప్రియుడు కావడంతో ప్రత్యేక అభిషేకాలు ఆలయంలో నిర్వహిస్తున్నారు. ఈశ్వరుడిని మారేడు దళములతో కానీ, తమ్మి పూలతో కానీ, బిల్వ పత్రాలతో కానీ పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వసం.
News Posted: 2 November, 2009
|