విశాఖపట్నం : విశాఖ జిల్లాలోని ఫారెస్టు చెక్పోస్టును మావోయిస్టులు పేల్చివేశారు. కొయ్యూరు మండలం కాకారపాడులో ఈ రోజు తెల్లవారుజాము సిబ్బందిని నిర్భందించి ఈ ఘాతుకానికి పాల్పడారు. కాగా పలు ప్రాంతాల్లో మార్గమధ్యలో ఉన్న చెట్లను నరికి రోడ్లకు అడ్డంగా వేశారు. దీంతో ఆ ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.