చిత్తూరు : చిత్తూరులోని పాత బస్టాండ్లో ఉన్న బస్సులో ఇంజన్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. కాగా వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బస్సు మంటల్లో చిక్కుకోవడంతో ప్రయాణికులు అద్దాలు పగుల గొట్టి సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.