అనంతపురం : జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పడగ విప్పింది. మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి అనుచరుడు కదిరి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం ఇందుకూరులోని తన వ్యవసాయ క్షేత్రానికి టాటా సుమోలో వెళ్తున్న ఆయనపై దాడి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికిచేరుకుని అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని వారు భావిస్తున్నారు.