వరంగల్ : జిల్లాలోని చెన్నారావు పేట మండలంలో భార్యను నరికి చంపిన ఓ భర్త తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరియ తండాలో శనివారం ఈ ఘటన జరగడంతో స్థానికుల్లో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్ట్ కు తరలించారు. ఈ దుర్ఘటనకు కుటుంబ కలహాలే కారణమని వారు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.