అనంతరపురం : ట్రాన్స్ఫార్మర్లు పేలటంతో ధర్మవరం సబ్స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ధర్మవరంలోని తారకరామాపురం విద్యుత్ సబ్ స్టేషన్ లో పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అధికంగా ఆస్థి నష్టం వాటిల్లినట్లు సమాచారం.