కర్నూలు : జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మందికి గాయలయ్యాయి. చాగలమర్రి మండలం కొడిగనూరు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.