త్వరలో 1000 సిఎన్జి బస్సులు
విజయవాడ : రాష్ర్ట వ్యాపితంగా రికార్డు స్థాయిలో వెయ్యి కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సిఎన్జి) బస్సులు ప్రవేశపెడుతున్నామని ఆర్టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యు సుధాకర్ చెప్పారు. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే విధంగా ఆధునిక టెక్నాలజీతో ఈ బస్సులను ప్రవేశపెడుతున్నామని ఆయన అన్నారు. నూతనంగా ప్రవేశపెట్టే ఈ సిఎన్జి బస్సుల్లో డిజిటల్ డిస్ప్లే, కెమెరాలు, ఎఫ్ఆర్పి సెట్లు అందుబాటులో ఉంచుతామని అన్నారు. విజయవాడ బస్స్టేషన్లో బుధవారం ఉదయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుధాకర్ మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు సిఎన్జి బస్సులను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. ప్రభుత్వం సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్లు అందుబాటులోనికి తెస్తే పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో బస్సులు ప్రవేశపెడతామని సుధాకర్ తెలిపారు.
News Posted: 12 November, 2009
|