సెక్యూరిటీ పై కానిస్టేబుల్ దాడి
వరంగల్ : ఎంజీఎం ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ పై ఏఆర్ కానిస్టేబుల్ కర్రతో దాడి చేయడంతో సెక్యూరిటీ గార్డు చేయివిరింది. హసన్ పర్తి గ్రామానికి చెందిన బొమ్మన శ్రీనివాస్ గత రెండేళ్ళ నుంచి ఎంజీఎం ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బుదవారం రాత్రి అత్యవసర సేవల విభాగంలో ఉండగా పోలీసులు వచ్చారు. లోనికి వెళ్తుండగా అనుమతి లేనిదే లోపలకు వెళ్ళరాదని, ఇన్ ఛార్జి డాక్టర్ అందరినీ పంపించాలని చెప్పడంతో దూరంగా వెళ్ళాలని సెక్యూరిటీ గార్డ్ పోలీసులుకు చెప్పాడు. దాంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ సెక్యూరిటీపై దాడి చేసినట్లు సమాచారం.
News Posted: 12 November, 2009
|