విశాఖపట్నం : విశాఖ జిల్లా బోయిపాలెం వద్ద ప్లాస్టిక్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 2 కోట్ల రూపాయల మేర ఆస్థినష్టం వాటిల్లినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు.