'విద్యార్థుల ఉత్తీర్ణతకు కృషి చేయండి'
చిత్తూరు : పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక షర్మన్ బాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణతపై ప్రధానోపాధ్యాయులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరంలో జరిగిన విధంగా కాకుండా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచే విధంగా పదవ తరగతి ఫలితాలు సాధించాలన్నారు. ఉత్తమ ఫలితాలకు ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. పదవ తరగతిలో విద్యార్థికి సక్రమైన విద్య అందించక పోతే పది సంవత్సరాల చదువును బూడిదలో పోసినపన్నీరులాగ అవుతుందని అన్నారు. గత ఏడాది 0 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డిఇఒ హమీద్, డిప్యూటీ డిఇఒ దేవానందరెడ్డి, జిల్లాలోని హెచ్ఎంలు పాల్గొన్నారు.
News Posted: 12 November, 2009
|