యూనివర్సిటీలో మెస్ సిబ్బంది సమ్మె
వరంగల్ : క్యాంపస్లోని కామన్ మెస్లో వంటలు బాగా లేవంటూ కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలోని విద్యార్థులు సమ్మెకు దిగారు. మెస్ కేర్టేకర్ను గదిలో బంధించి తాళం వేశారు. దీంతో మెస్ సిబ్బంది తమకు రక్షణ కల్పించాలని ఆందోళనకు దిగారు. వంటలు బాగాలేవంటూ విద్యార్థులు ఓ వైపు, తమకు విద్యార్థులనుంచి భద్రత కల్పించాలంటూ మెస్ సిబ్బంది మరో వైపు సమ్మెకు దిగడంతో క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
News Posted: 13 November, 2009
|