బోల్తా పడ్డ పెళ్లి లారీ
విజయవాడ : పెళ్లి బృందంతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో 70 మందికి గాయాలయ్యాయి. కృష్ణా జిల్లాలోని విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిని తిరువూరు, విస్సన్నపేట ఆసుపత్రులకు తరలించారు.
News Posted: 13 November, 2009
|