ఆస్పత్రిలో ప్రతిపక్షాల నిరసన
విజయవాడ : విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి పిల్లల వార్డులో ఆరుగురు పసికందుల మృతి ఘటనపై ప్రతిపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నేతలు తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు, సీపీఎం నాయకుడు బాబురావు, సీపీఐ నగర కార్యదర్శి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల మృతి చెందిన ఘటనపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి గానీ ఆస్పత్రి వర్గాల నుంచి కానీ ఎటువంటి స్పందన వ్యక్తం కాకపోవడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
News Posted: 16 November, 2009
|