శ్రీకాకుళం : వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి బస్సును ఢీకొనడంతో 15 మంది గాయపడ్డారు. జిల్లాలోని ఇచ్చాపురం సమీపంలోని బహుదానది పాత వంతెన పై ఓ ప్రైవేటు బస్సును లారీ ఢీ కొన్న సంఘటన సంభవించింది. స్థానికులు గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.