జియోటెక్నికల్ అంతర్జాతీయ సదస్సు
గుంటూరు : జియెటెక్నికల్ అంతర్జాతీయ సదస్సును డిసెంబర్ 17 నుంచి 19 వరకు గుంటూరులో నిర్వహించున్నట్లు ఆర్ వి ఆర్ అండ్ జెసి ఇంజనీరింగ్ కళాశాల ట్రెజరర్ డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ వెల్లడించారు. గుంటూరు నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఐజిసి 2009 సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భౌగోళికంగా జరుగుతున్న మౌలిక వనరుల అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టాల్సిన ప్రాజెక్టులకు దిశ, నిర్ధేశం చేస్తారని అన్నారు. నిష్ణాతులైన జియోటెక్నికల్ ఇంజనీర్లు దాదాపు వంద మంది పేపర్ ప్రజెంటేషన్ చేస్తారని వెల్లడించారు.
News Posted: 16 November, 2009
|