ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రైస్ మిల్లలపై పౌరసరఫరాల అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. దీంతో ఓ రైస్ మిల్లర్ యజమాని శ్రీనివాసరావు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన రైస్ మిల్లుల యజమానులు శ్రీనివాసరావు మృత దేహంతో ఆందోళనకు దిగారు.