'ఉత్తమ పౌరులుగా ఎదగండి'
విజయవాడ : క్యాడెట్లు అందరు ఎన్సిసి మూడు సూత్రాలను పాటించి ఉత్తమ పౌరులుగా ఎదగడానికి కృషి చేయాలని కలెక్టర్ పీయూష్ కుమార్ సూచించారు. ఈ నెల 22న నిర్వహించనున్న ఎన్సిసి దినోత్సవాన్ని పురస్కరించుకుని స్ధానిక 16 ఆంధ్రా ఎన్ఎన్సి బెటాలియ న్ క్యాడెట్లు మంగళవారం నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సిసి క్యాడె ట్లు అందరు క్రమశిక్షణతో మెలిగి మంచి శిక్షణ పొంది ఆదర్శవంతులు గా ఎదగాలన్నారు. కోనేరుసెంటర్ నుండి ప్రారంభం అయిన ఈ ర్యాలీ పట్టణ పురవీధుల గుండా ఎన్సిసి బెటాలియన్ కార్యాలయం వరకు సాగింది. ఎన్సిసి మూల సిద్దాంతాలు, తదితర అంశాలను క్యాడెట్లు స్లోగన్స్గా నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో 16 ఆంధ్రా బెటాలియన్ కమాండెంట్ అధికారి కల్నల్ మనుసత్తి, ఆర్డీఓ కట్టా హైమావతి, పాఠశాలల, కళాశాలల ఎన్సిసి అధికారులు పాల్గొన్నారు.
News Posted: 18 November, 2009
|