విశాఖపట్నం : కొండ చరియలు విరిగి పడడం వల్ల ఇద్దరు చిన్నారులు నిద్రలోనే తనువు చాలించారు. విశాఖ జిల్లా మాధవధార వద్ద కొండ మట్టి పెళ్ళలు విరిగి పడడంతో నిద్రపోతున్న చిన్నారులకు ఊపిరాడక పోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ సంఘటనతో స్థానికుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.