విజయవాడ : వివాహ సందర్భంగా పెళ్ళికానుగా వచ్చిన గిప్ట్ బాక్స్ లో బాంబు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం కావడంతో పెళ్ళింట బాంబు గోల మైదలైంది. కృణాజిల్లా తిరువూరులో ఓ పెళ్ళింట వధూవరులకు గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ లో బాంబు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో కలవరపడిన వారు ఆ సూట్ కేస్ ను పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాంబ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపి బాక్స్ మొత్తాన్ని సోధించి అలాంటిదేమీ లేదని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.