25న సాయి అహోరాత్ర యజ్ఞం
ఏలూరు : సమాజ హితవుతో పాటు సంచిత కర్మలనుంచి మానవులు విముక్తి పొందేందుకు వీలుగా షిరీడీ సాయి అహోరాత్ర యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు దత్త కారుణ్య ట్రస్ట్ నిర్వాహకుడు గురురామ్ రతన్ వెల్లడించారు. నగరంలోని కట్టాసుబ్బారావు తోట, బరోడా బ్యాంకు సమీపాన ఉన్న స్థలంలో ఈ యజ్ఞాన్ని ఈనెల 25 నుంచి 27వ తేదీవరకు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కులమతాలకు అతీతంగా భక్తులు ఈ యజ్ఞంలో పాల్గొని షిరిడీ సాయిబాబా ఆశీస్సులను పొందాలని భక్తులకు మనవి చేశారు. ఈ యజ్ఞంలో పాల్గొన భక్తులకు పూజా సమాగ్రిని ఉచితంగా అందజేస్తామని ట్రస్టు జిల్లా విభాగం అధ్యక్షుడు బి.వి.కృష్ణారెడ్డి, కార్యదర్శి ఉమామహేశ్వరరావు వెల్లడించారు.
News Posted: 20 November, 2009
|