విజయవాడ : నగరంలోని పవర్ స్టేషన్లోని ఏడో యూనిట్లో మంగళవారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. విజయవాడ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ లో ఈ ప్రమాదం జరగడంతో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. దీంతో అప్రమత్తమయిన అధికారులు పవర్ యూనిట్లో మరమ్మతులు చేపట్టారు.