గుంటూరు : ఉపాధి హామీ పనుల్లో ఐదు కోట్ల యాబై లక్షల రూపాయలు అక్రమంగా గల్లంతు అయ్యాయి. బొల్లాపల్లి మండలంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన సుమారు 35 మందిపై కలెక్టర్ చర్య తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తునకు పంపించారు. గల్లంతైన కోట్ల రూపాలయను వెంటనే రికవరీ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.