విశాఖపట్నం : విద్యార్థులను భావిపౌరులుగా తీర్చి దిద్దాల్సిన ఉపాధ్యాయులే ఆగ్రహావేశాలను నిగ్రహించుకోలేక పోతున్నారు. దీంతో వారి వృత్తికే కళంకం ఏర్పడుతోంది. విశాఖపట్నం గాజువాక లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదువుతున్నవిద్యార్థి కేవలం టెక్ట్స్ బుక్ లేదన్న కోపంతో ఆగ్రహించిన లెక్చరర్ అతని చేతి వేళ్ళు విరగకొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లితండ్రులు కళాశాల వద్దకు వచ్చి యాజమాన్యాన్ని నిలదీయడంతో లెక్చరర్ దుశ్చర్య బయటపడింది.