కనక మహాలక్ష్మికి క్షీరాభిషేకం
విశాఖపట్నం : విశాఖ జిల్లా వాసుల కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, సహస్రనామార్చన చేశారు. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా రెండో గురువారం అమ్మవారిని స్వర్ణ కవచాలతో, పుష్పాలతో అలంకరించారు. ముఖ్యమంత్రి రోశయ్య సతీమణి గురువారం తెల్లవారుజామున అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలానే కేంద్రమంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు మోపూరు వెంకటరమణ, పితాని సత్యనారాయణ, ప్రిన్సిపాల్ కార్యదర్శి జె.సత్యనారాయణ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విశాఖ వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో క్యూలైన్లు అన్నీ కిటకిటలాడాయి. క్యూలైన్లలో ఉన్న వీరికి మంచినీటి ప్యాకెట్లను, పిల్లలకు పాలు, బిస్కెట్లను దేవస్థానం ఉంచితంగా పంపిణీ చేసింది. ఆలయం వద్ద అన్న దాన కార్యక్రమం కూడా నిర్వహించారు.
News Posted: 27 November, 2009
|