తిరుపతి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్థగిరి శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో బుధవారం మార్గశిర పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ వీరాంజనేయస్వామి చందనం అలంకరణతో భక్తులకు దివ్యదర్శన మిచ్చారు. ఉదయం స్వామివారికి సుదర్శన హోమం చేయించారు. సాయంత్రం ప్రాకిరోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా క్షేత్రంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పౌర్ణమి వేడుకలకు వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన భక్తులతో అర్థగిరి కిటకిటలాడింది. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.