కోర్టుకు బాంబు బెదిరింపు
గుంటూరు : జిల్లా కోర్టులో బాంబు ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి కోర్టులో బాంబు ఉందంటూ ఫోన్ చేయడంతో న్యాయవాదులు, ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం బాంబు నిర్వీర్యంచేసే బృందంతో పాటు డాగ్ స్వ్కాడ్ ను రంగంలోకి దింపి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
News Posted: 7 December, 2009
|