అలరించిన 'వందే సాయిమాతరం'
అనంతపురం : పుట్టపర్తిలోని ప్రశాంతినిలయంలో పంజాబ్ కు చెందిన సత్యసాయి యువజన భక్తబృందం ప్రదర్శించిన 'వందే సాయిమాతరం' నృత్యనాటిక ఆహుతులను అలరించింది. భరత మాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ దేశభక్తిని మరోసారి ఈ నాటిక ద్వారా చాటి చెప్పారు. అలానే సత్యసాయి మార్గదర్శకాలను, దేశభక్తిని, సత్యసాయి సనాతన ధర్మాలను, సేవా నిరతిని సేవా సంస్థల ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలను నాటికలో తెలియజేశారు. కళాకారులకు, బాబా వస్త్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జనార్ధన్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. వేలాది మంది దేశ, విదేశీ భక్తులను ఈ కార్యక్రమాలు అలరించాయి.
News Posted: 7 December, 2009
|