కిటకిటలాడిన బోయకొండ
చిత్తూరు : వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్త జనంతో చౌడైపల్లిలోని బోయకొండలో వెలసిన గంగమ్మ ఆలయం కిటకిటలాడింది. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అభికాలు, పూజలు చేశారు. వీఐపీల తాకిడితో సామాన్య భక్తులు అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ ఛైర్మన్ ఎస్ కె.రమణారెడ్డి, ఈవో వెంకటేశ్వర్లు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వివిధ జిల్లాలకు నుంచి వచ్చిన కళాకారుల చెక్క భజన బృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.
News Posted: 7 December, 2009
|