మార్చిలో స్కాలర్ షిప్ లు
విశాఖపట్నం : జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న బీసీ విద్యార్థులకు వచ్చే ఏడాది మార్చి నాటికి స్కాలర్ షిప్ లు, ఫీజులు మంజూరు చేస్తామని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి డి.నాగేశ్వరరావు వెల్లడించారు. ఎంవీపీ కాలనీలోని సంస్థ కార్యాలయంలో ఆయనను కలిసిన విలేఖరులతో మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం (2009-10)లో చేసుకునే దరఖాస్తుల గడువు ఈనెల 15వ తేదీలోగా పూర్తవుతుందన్నారు. స్కాలర్ షిప్ దరఖాస్తుల వెబ్ సైట్ ని రామ్ ఇన్ఫర్మేటిక్స్ స్థానంలో గుడ్ గవర్నన్స్ సెంటర్ కి ప్రభుత్వం అప్పగించిందన్నారు.
News Posted: 8 December, 2009
|