17 నుంచి తిరుప్పావై ప్రవచనం
తిరుమల : ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవను రద్దు చేయనున్నారు. దీని స్థానంలో తిరుప్పావై ప్రవచనం నిర్వహించనున్నారు. ఈనెల 17 నుంచి జనవరి 14వ తేదీవ వరకు సుప్రభాత సేవను రద్దు చేసి, తిరుప్పావై ప్రవచనం నిర్వహిస్తారు. ఈ నెల రోజులూ శ్రీవారిని శ్రీకృష్ణుడిగా భావించి పూజలు నిర్వహించడం తో పాటు చిలుకలను అలంకరిస్తారు. దీంతో పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు, విశేషమైన నైవేద్యలు శ్రీవారికి సమర్పిస్తారు. ఈ సందర్భంగా ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆస్థాన మంటపంలో ఆథ్యాత్మిక ప్రవచనం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని టీటీడీ పీఆర్వో ఒక ప్రకటనలో తెలిపారు.
News Posted: 11 December, 2009
|