విశాఖ : నగరంలోని హెచ్ఎస్బీసీపై దాడి జరిగింది. సిరిపురం జంక్షన్ లో ఉన్న బ్యాంకులోని విలువైన ఫర్నీచరును ఆందోళనకారులు ధ్వంస చేశారు. సమైక్యాంధ్రను కోరుతూ శుక్రవారం బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగుతుండడంతో ఆందోళనకారులు తీవ్రంగా మండిపడ్డారు. ముందుగా చెప్పినా ఎందుకు బంద్ చేయలేదని విధ్వంసకారులు నిలదీశారు. బ్యాంకులోకి ఒక్కసారిగా చొచ్చుకువచ్చి దాడి చేయడంతో ఉద్యోగులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు.