మేయర్ భానుశ్రీ రాజీనామా
నెల్లూరు : తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జిల్లా ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సమైక్యాంధ్రాకు మద్దతుగా నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ తో సహా 24 మంది కార్పోరేటర్లు రాజీనామా బాటలో నడిచారు. తమ ప్రాంతల వారి మనోగతాలను తెలుసుకోకుండా తెలంగాణపై ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
News Posted: 11 December, 2009
|