తిరుపతి : సమైక్యాంధ్ర కోరుతూ చిత్తూరు జిల్లా కుప్పంలో ఆందోళనకారులు బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగించారు. దీంతో తమిళనాడు నుంచి చిత్తూరు వైపు వెళ్ళే వాహనాలన్నీ కుప్పం వద్ద నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రజలు తమతమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు.