అనంతలో 144 సెక్షన్
అనంతపురం : ప్రత్యేక తెలంగాణాపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో శుక్రవారం వివిధ పార్టీల నాయకులు బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా ఎస్పీ ఎంకె సింగ్ జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం రాత్రి నుంచే జిల్లా వ్యాప్తంగా పోలీసులు, మొబైలింగ్, పెట్రోలింగ్ టీమ్ లను ఏర్పాటు చేసి గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ నాయకులు, విద్యార్థులు ఘర్షణలకు పాల్పడకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీసు అధికారులుకు ఎస్పీ సూచించారు. ప్రశాంత బంద్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన అన్ని పార్టీల నాయకులను కోరారు.
News Posted: 11 December, 2009
|