గుంటూరులో బంద్ ప్రశాంతం
గుంటూరు : సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీలకు అతీతంగా నేతలు, విద్యార్థులు గుంటూరు జిల్లాలో బంద్ చేపట్టారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గుంటూరు నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న బస్సును నిరసనకారులు అడ్డగించారు. మిర్చియార్డులో వ్యాపారస్థులు కొనుగోళ్ళు నిలిపివేశారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విద్యార్థులు జేఏసీగా ఏర్పడి సమైకాంధ్రకు పిలుపునిచ్చారు. జిల్లాలో చెదురుమదురు సంఘటనలు నెలకొన్నా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
News Posted: 11 December, 2009
|