రేపు దుర్గ గుడిలో పూర్ణాహుతి
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీ దుర్గామల్లేశ్వర ఆలయంలో భవానీ దీక్షల విరమణల కార్యక్రమం శనివారంతో ముగియనుంది. విఘ్నేశ్వరాలయం, నటరాజస్వామి, శివకామసుందరి ఆలయాల వద్ద నిర్వహిస్తున్న శతచండీ యాగం కార్యక్రంలో రేపు ఉదయం 11 గంటలకు మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుందని అర్చక ప్రతినిధి రంగావఝుల శ్రీనివాస శాస్త్రి చెప్పారు. శని, ఆదివారాలు కలసిరావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో సిబ్బంది ఈ మేరకు తగిన ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు.
News Posted: 11 December, 2009
|