'దీక్షలు చేపడతాం'
కర్నూలు : సమైక్యాంద్రకు మద్దతుగా మారెప్ప యువసేన, ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డి యూత్ గ్రూహ్ ఆధ్వర్యంలో వైఎంజీ సర్కిల్ లో స్థానిక కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఏఏఎస్ కళాశాల నుంచి ప్రదర్శనగా వెళ్ళి ఆందోళన చేపట్టారు. ఒకరు దీక్ష చేస్తేనే తెలంగాణా ఇస్తే సమైక్యాంధ్ర కోసం వందమంది దీక్షలు చేపడతారన్నారు. ఈ కార్యక్రమంలో మారెప్ప యువసేన అధ్యక్షులు సన్ని, రాఘవేంద్ర, ముత్తుకూరు ఎంపీటీసీ సభ్యుడు జయన్న తదితరులు పాల్గొన్నారు.
News Posted: 11 December, 2009
|