విజయవాడ : నూజివీడు మాజీ ఎమ్మెల్యే కోటగిరి హన్మంతరావు శనివారం మృతిచెందారు. కొద్దిరోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన హన్మంతరావు తెలుగుదేశం పార్టీలో కీలకపాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.