విజయవాడ : ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిలో శనివారం భవానీదీక్షల విరమణకు చివరి రోజు కావడంతో భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. అర్థరాత్రి నుంచే భక్తులు ఆలయానికి చేరుకోవడంతో క్యూలైలన్నీ నిండిపోయాయి. భవానీ దీక్షల విరమణ సందర్భంగా మహా పూర్ణాహుతి కార్యక్రమం కూడా ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో దుర్గమ్మను దర్శించుకునేందుకు తరలివచ్చారు.