విశాఖపట్నం : కోస్తా-ఆంధ్రాలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల దృష్ట్యా కోస్తాకు అడిషనల్ డీజీగా దుర్గాప్రసాద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ప్రకటన అనంతరం కోస్తా - ఆంధ్రాలో సమైక్యాంధ్రా నినాదం ఊపందుకోవడంతో శాంతిభద్రతల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.