కార్యాలయాల మూసివేత
విజయవాడ : కృష్ణాజిల్లాలో సమైక్యాంధ్రకు మద్ధతుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల మూసి వేతకు జేఏసీ గురువారం పిలుపునిచ్చింది. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనా కార్యక్రమాలను మరింత ఉధృతం చేయడంతో పలు ప్రాంతాల్లో అప్రకటిత బంద్ నడుస్తోంది. ఆయా ప్రాంతాల్లో విద్యా సంస్థలు మూసేసి విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనా కార్యక్రమాలు చేపడుతున్నారు. నందిగామ, జగ్గయ్యపేట పట్టణాల్లో వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. నూజివీడులో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూసేశారు. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. న్యాయవాదులు, ఆటో యూనియన్ల నేతలు భారీ ర్యాలీలు నిర్వహించారు.
News Posted: 17 December, 2009
|