తిరుపతి : తిరుమల క్షేత్రంలో ఓ భక్తుడు నిరాటంకంగా శ్రీవారికి శంఖార్చన చేసి తన భక్తిని చాటుకున్నాడు. బుధవారం ఉదయం తొమ్మిదిగంటలకు శ్రీవారి ఆలయం ఎదుట గొల్లమండపం వెనుక నిల్చొని రెండు గంటలపాటు ఏకధాటిగా శంఖం పూరించాడు. ఆ సమయంలో జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా శ్రీవారిపై తన కున్న భక్తిని చాటుకున్నాడు. కలియుగ వైకుంఠుడైన శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో అత్యంత సమీపం నుంచే శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. సమైక్యాంద్రకు మద్దతుగా కొనసాగుతున్న బంద్ కారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య తగ్గింది. దీంతో బుధవారం 23 కంపార్టుమెంట్లు మాత్రమే నిండాయి.