విశాఖపట్నం : కలుషిత ఆహారం తిని 10 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని బాలసదన్లో ఓ హస్టల్లో అల్పాహారం తిన్న చిన్నారులు వాంతులు చేసుకొన్న సంఘటన జరిగింది. హాస్టల్ సిబ్బంది వాంతులు చేసుకున్న చిన్నారులను వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.